దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. నేడు 1.68 లక్షల కేసుల నమోదు

- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ క‌రోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంట‌ల్లో ఏకంగా 1,68,912 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే, 904 మంది కరోనాకు బలయ్యారు.

దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా బారిన ప‌డిన వారి మొత్తం సంఖ్య 1.35 కోట్ల‌కు చేర‌ుకోగా, 1,70,179 మంది మృత్యువాత పడ్డారు. నిన్న‌ 75,086 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717గా నమోదైంది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా 10,45,28,565 మందికి వ్యాక్సిన్లు వేశారు. 12,01,009 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -