న్యూఢిల్లీ: భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. డేటా వినియోగం భారీగా వృద్ది చెందుతోందని, ఈ సంవత్సరం ఆగస్టులో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 46.36 కోట్లకు పెరిగిందని టెలికాం డిపార్ట్మెంట్ (డీఓటీ) తెలిపింది. అంతకు ముందటి నెల జూలైలో ఉన్న వినియోగదారుల సంఖ్య (46 కోట్లు)తో పోల్చితే 0.74 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
డాట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ సంవత్సరం జూలైతో పోల్చితే ఆగస్టులో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 97.3 లక్షలు పెరిగి 118.9 కోట్లకు చేరింది. వీరిలో వైర్లెస్ ఫోన్ వినియోగదారుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 0.84 శాతం వృద్ధిచెంది 116.7 కోట్లకు ఎగసింది. ఈ ఆగస్టులో మొత్తం ఫోన్ కనెక్షన్లు అత్యంత అధికంగా ముంబైలో పెరిగాయి. ముంబైలో 19.35 లక్షల ఫోన్ కనెక్షన్లు పెరిగాయి.