భారత సైన్యంపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫైర్‌, ఏమన్నారంటే…

Imran Khan1
- Advertisement -

Imran Khan1

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై మరోమారు తన అక్కసు వెళ్లగక్కారు. అమాయక కశ్మీర్‌ ప్రజలపై భారత​ సైనిక దళాలు తూటల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు.  జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ మిలిటెంట్లు హతమవగా.. ఆ వెంటనే ఘటనా స్థలంలో మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలి ఏడుగురు కశ్మీర్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం భారత భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మొత్తం పదిమంది చనిపోయారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.  దీనిపై తాజాగా సోమవారం ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు.

భారత సైన్యం కశ్మీర్‌ పౌరులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కశ్మీర్‌ సమస్యకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘పాకిస్తాన్‌తో ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్‌ చర్చలకు రావాలి.. చర్చలతోనే కశ్మీర్‌క సమస్యకు శాశ్వత పరిష్కరం దొరుకుతుంది..’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కశ్మీర్‌ పౌరులపై దాడులను ప్రేరేపిస్తూ.. పాక్‌తో చర్చల వల్ల ప్రయోజనం లేదని భారత్‌ అభిప్రాయపడుతోందని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -