తెలంగాణ రాజకీయ నేతలతో.. కేంద్ర ఎన్నికల సంఘం బృందం భేటీ

Ravant
- Advertisement -

Ravant

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన తొమ్మిది రాజకీయ పార్టీల నాయకులతో హోటల్‌ తాజ్‌ కృష్ణలో సమావేశం అయింది.

కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరు అయ్యారు. అంతేకాక కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు పది నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్‌ తాజ్‌ కృష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు.

ఈసీ బృందంతో భేటికి హాజరైన వివిధ పార్టీలు – పార్టీ సభ్యులు…

బీజేపీ – ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం
టీఆర్ఎస్ – వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ – మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్
టీడీపీ – రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి
వైసీపీ – రవికుమార్, సంజీవరావు
సీపీఐ – చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు
సీపీఎం – నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్
ఎంఐఎం – ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ
బీఎస్పీ – సిద్ధార్థ్ పూలే

పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్, పోలీసు విభాగం నోడల్‌ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో కూడా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది.

- Advertisement -