ప్రో కబడ్డీ లీగ్‌ 2018: తెలుగు టైటాన్స్ Vs యూపీ యోధా, ఆద్యంతం ఉత్కంఠభరితం.. చివరికి ‘డ్రా’…

telugu titans up yodha match ending as draw in pro kabaddi league 2018
- Advertisement -

telugu titans up yodha match ending as draw in pro kabaddi league 2018

నోయిడా: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్‌-6లో మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26–26తో ‘డ్రా’గా ముగిసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్‌ ఈ మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది.

తెలుగు టైటన్స్.. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (3 పాయింట్లు) తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో తొలి అర్ధభాగంలో 10–19తో వెనుకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని 26-26తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది.

రెండో అర్ధభాగంలో ఇటు రైడింగ్‌లో, అటు ట్యాక్లింగ్‌లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్‌ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీలేశ్ 4 పాయింట్లు, మొహ్‌సిన్ 4 పాయింట్లు, అబోజర్‌ 4 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నారు. యూపీ యోధా తరఫున సచిన్‌ కుమార్‌ 5 పాయింట్లు, శ్రీకాంత్ 4 పాయింట్లు, రిశాంక్‌ దేవడిగ 4 పాయింట్లు సాధించారు.

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు వరుసగా రెండో విజయం…

ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ వరుసగా రెండో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 38–32తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగే మ్యాచ్‌లు…

హర్యానా స్టీలర్స్‌ x దబాంగ్‌ ఢిల్లీ

బెంగళూరు బుల్స్‌ x యూపీ యోధా

- Advertisement -