సంచలనం: పదవికి, పార్టీకి బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా.. కారణం ఇదేనా?

mla-raja-singh
- Advertisement -

mla-raja-singhహైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అందజేశారు. రాజా సింగ్ హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ విప్‌గా ఆయన పనిచేస్తున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

గో రక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. తన ఉద్యమానికి, పార్టీకి ముడిపెడుతున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి నష్టం వాటిల్లొద్దనే భావనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

నాలుగు రోజుల క్రితమే రాజీనామా లేఖ సమర్పించినట్టు రాజా సింగ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక యథేచ్చగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ చేతిలో సీఎం కేసీఆర్ కీలుబొమ్మలా మారారని ఆయన ఎద్దేవా చేశారు. ముడుపులు తీసుకొని గోవుల అక్రమ రవాణాను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. గోవధను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టలేకపోతే… మేమే రంగంలోకి దిగుతామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -