లండన్: వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా డబ్బులు వెనక్కి తీసుకోవాలంటూ భారత్లోని బ్యాంకులకు మరోసారి మొరపెట్టుకున్నాడు.
విచారణ కోసం గురువారం లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్కు వచ్చిన మాల్యా.. కోర్టు ఆవరణలో మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన అసలులో వందకు వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరాడు.
చదవండి: మాజీ మంత్రి సుష్మాస్వరాజ్కు కేంద్రం అరుదైన గౌరవం!
ఈ విషయంలో చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు చెప్పాడు. తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు.
అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం ఓ వైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయని పేర్కొన్న మాల్యా.. బ్యాంకులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరాడు.