న్యూఢిల్లీ: ఉచిత డేటా భారీ ఆఫర్లతో టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. జియో తాజాగా ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది.
ఈ ఆఫర్ కింద రూ.399 రీచార్జ్పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ఈ క్యాష్బ్యాక్ కూపన్లు రూపంలో లభిస్తుంది.
రూ.399 రీచార్జ్పై 100 శాతం క్యాష్ బ్యాక్…
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కోసం జియో.. ఆన్లైన్ రీటైలర్ అజియో డాట్ కాంతో జత కట్టింది. రూ.399 రీచార్జ్పై 100 శాతం అంటే రూ.399 క్యాష్ బ్యాక్ వినియోగదారులకు లభిస్తుంది. దీనికి సంబంధించిన కూపన్ మై జియో కూపన్లో యాడ్ అవుతుంది. ఈ కూపన్ను అజియో.కాంలో షాపింగ్కు వినియోగించుకోవచ్చు.
అయితే ఇక్కడ ఓ చిన్న మెలిక కూడా ఉంది. ఈ క్యాష్ బ్యాక్ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ జనవరి 31 వరకూ ఉంటుంది. ఈ గడువులోగా ఈ ఆఫర్ కింద వినియోగదారులు పొందిన కూపన్లను మార్చి 15, 2019 లోపుగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.