లక్నో: తల్లిదండ్రులు తాము సాధించలేని వాటినో.. లేక తమ కంటే ఇంకా మంచి విజయాలని తమ పిల్లలు సాధించాలిన కోరుకుంటారు. అ విజయన్ని కోడుకు సాధిస్తే… ఇక చెప్పడానికి మాటలు చాలవు. ప్రస్తుతం ఇలాంటి పుత్రోత్సాహాన్నే అనుభవిస్తున్నారు విభూతి ఖండ్లో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న జనార్థన్ సింగ్.
ఎందుకంటే ఆయన కుమారుడు అనూప్ కుమార్ సింగ్ ఇప్పుడు ఆయనకే బాస్గా వచ్చారు. విషయమేంటంటే.. జనార్ధన్ సింగ్ కుమారుడు అనూప్ ఇప్పుడు లక్నో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు.
ఈ విషయం గురించి జనార్ధన్ సింగ్ మాట్లాడుతూ ‘‘వ్యక్తిగతంగా తండ్రి, కొడుకులం. కానీ వృత్తిపరంగా నా కొడుకు నా కంటే సుపీరియర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నా బాధ్యతలను నిర్వర్తిస్తాను’’ అని తెలిపారు.
అంతేకాదు, ‘‘ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు నేను నా కుమారునికి సెల్యూట్ చేయాలి. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నా హృదయం గర్వంతో ఉప్పొంగి పోతుంది. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను..’’ అని గర్వంగా చెబుతున్నారాయన.