జాతీయగీతం ఆలపిస్తుండగా.. కుర్చీలోనే సొమ్మసిల్లిన కేంద్రమంత్రి.. కంగారుపడిన అధికారులు, ఎక్కడంటే…

central union minister nitin gadkari faints on stage in Ahmednagar
- Advertisement -

central union minister nitin gadkari faints on stage in Ahmednagar

ముంబై : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు. గడ్కరీ కుర్చీలో పడిపోతుండగా పక్కనే ఉన్న గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, అక్కడున్న వారు స్పందించి వెంటనే ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు.

కొంత విశ్రాంతి అనంతరం ఆయన మామూలు స్థితికి వచ్చారు. అనంతరం నితిన్‌ గడ్కరీని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు.  షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం గడ్కరీ షిర్డీ బయలుదేరి వెళ్లారు.

2014 ఎన్నికల్లో నాగపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన గడ్కరీ ఉపరితల రవాణా, నీటి వనరులు, షిప్పింగ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో వివరిస్తూ.. తను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -