న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అల్లాడుతున్న ఇరాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను భారత వాయసేన రక్షించింది. వారి కోసం వెళ్లిన ప్రత్యేక విమానం మరికొద్ది సేపట్లో భారత్లో ల్యాండ్ అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.
చదవండి: చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు
టెహ్రాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయుల కోసం వెళ్లిన వాయసేన విమానం సి-17 వారిని వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అయిన హిండోన్కు తీసుకురాబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
జై శకంర్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ విమానం హిండోన్లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి జై శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
చైనా తర్వాత ఇరాన్లోనే…
చైనా తర్వాత కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇరాన్లోనే. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వందలాదిమంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
చదవండి: ఐపీఎల్కూ కరోనా గాలి.. టోర్నీ నిర్వహణపై సందిగ్ధం
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. తొలి విడతగా 58 మంది అక్కడి నుంచి తరలించినట్టు మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.
ఇరాన్లో ఇప్పటి వరకు 230 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఒక్క రాజధాని టెహ్రాన్లోని 1945 కేసులు నమోదు కావడం గమనార్హం.
కాగా, ఇరాన్లోని క్వామ్ నగరంలో ఉన్న మరో 40 మంది భారతీయులకు వైద్యసాయం అందించేందుకు ఢిల్లీ నుంచి వైద్యుల ప్రత్యేక బృందాన్ని భారత్ పంపింది.
First batch of 58 Indian pilgrims being brought back from #Iran. IAF C-17 taken off from Tehran and expected to land soon in Hindon. pic.twitter.com/IqZ8NUK1M6
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 10, 2020