హమ్మయ్య.. వచ్చేశారు: ఇరాన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న 58 మంది భారతీయులు

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ఇరాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను భారత వాయసేన రక్షించింది. వారి కోసం వెళ్లిన ప్రత్యేక విమానం మరికొద్ది సేపట్లో భారత్‌లో ల్యాండ్ అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

చదవండి: చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు

టెహ్రాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయుల కోసం వెళ్లిన వాయసేన విమానం సి-17 వారిని వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అయిన హిండోన్‌కు తీసుకురాబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

జై శకంర్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ విమానం హిండోన్‌లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి జై శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

చైనా తర్వాత ఇరాన్‌లోనే…

చైనా తర్వాత కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇరాన్‌లోనే. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వందలాదిమంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: ఐపీఎల్‌కూ కరోనా గాలి.. టోర్నీ నిర్వహణపై సందిగ్ధం

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. తొలి విడతగా 58 మంది అక్కడి నుంచి తరలించినట్టు మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.

ఇరాన్‌లో ఇప్పటి వరకు 230 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఒక్క రాజధాని టెహ్రాన్‌లోని 1945 కేసులు నమోదు కావడం గమనార్హం.

కాగా, ఇరాన్‌లోని క్వామ్ నగరంలో ఉన్న మరో 40 మంది భారతీయులకు వైద్యసాయం అందించేందుకు ఢిల్లీ నుంచి వైద్యుల ప్రత్యేక బృందాన్ని భారత్ పంపింది. 

- Advertisement -