అమరావతి: ఈ భూ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. ఒకదానికి మరొకదానికి లింకు ఉంటుంది. కొంచెం తీక్షణంగా చూస్తే ఇలాంటివి మనకి కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే, మరెక్కడో దాని ప్రభావం ఉంటుందంటూ ‘నాన్నకి ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న లాజిక్ చెబుతాడు.
చదవండి: జూన్ 8న ఏపీ మంత్రివర్గం విస్తరణ….!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో 151 అంకెను విశ్లేషించినప్పుడు ఇదే విషయం కనిపించకమానదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ అయిన వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
ఇక విషయానికొస్తే… దివంగత మహానేత, మాజీ సీఎం వైఎస్ మరణం నేపథ్యంలో జగన్ను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ 151 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పట్లో సంతకాలు చేసిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు.
అప్పట్లో అంతమంది ఎమ్మెల్యేల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం కొణిజేటి రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.