పదేళ్ళ పాటు జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది: హీరో సూర్య

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తమిళ హీరో సూర్య ప్రశంసల జల్లు కురిపించారు. తన సినిమా ఎన్‌జి‌కే ప్రమోషన్‌లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్బంగా తన మిత్రుడు జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు జగన్ పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలమిదని, తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జగన్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, ఏపీకి  సీఎం కానున్న జగన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ ఆయన ఎదుర్కొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇక ‘ఎన్జీకే’ బయోపిక్ కాదని, సమాజంలో జరిగే విషయాలే తెరపై ఉంటాయని స్పష్టం చేశారు. ఓ పార్టీకో, నాయకుడికో, ప్రాంతానికో అన్వయించే కథ కాదని, అందరి కథలా అనిపిస్తుందని చెప్పారు.
కాగా, హీరో సూర్య నటించిన చిత్రం ‘ఎన్జీకే’ ఈ నెల 31న విడుదల కానుంది.

చదవండి: ప్రమాణ స్వీకారోత్సవానికి రండి! చంద్రబాబును ఆహ్వానించిన జగన్!

- Advertisement -