దేశ రాజధానిలో తెలుగు బాలికపై అత్యాచారం: ఏపీ భవన్‌కు సమాచారం

Dehli Latest News, India Latest Crime News, Dehli Crime News, Crime Latest News, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై సోమవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు ఏపీ భవన్ అధికారులను సంప్రదించారు.

బాలికకు అబార్షన్ చేయించారు..

16ఏళ్ల తెలుగు బాలికపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘గురుటేక్‌ నగర్‌లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించాం. ఆ బాలికకు ఇటీవలే అబార్షన్‌ చేసినట్లుగా ఉంది. గతంలో ఎవరో అత్యాచారం చేసి తదనంతరం అబార్షన్‌ చేసినట్టుగా భావిస్తున్నాం’ అని తెలిపారు.

బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రశ్నించాం. హిందీ, ఆంగ్ల భాషలను అర్థం చేసుకోలేకపోతోంది. తెలుగు మాట్లాడుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశాం. కోర్టులో మంగళవారం విచారణకు రానుందని తెలిపారు.

హిందీ, తెలుగు అర్థం చేసుకొనే వ్యక్తిని దుబాసీగా పంపగలరు అని భవన్‌ అధికారులను ఢిల్లీ పోలీసులు కోరారు. కాగా, పూర్తి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

చదవండి:అందుకే మహేశ్ బాబుపై ఐటీ దాడులు: గల్లా సంచలనం

- Advertisement -