- Advertisement -
హైదరాబాద్: సుదీర్ఘ పాదయాత్ర ముగించుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రేపు లండన్కు పయనం కానున్నారు. తన భార్యతో కలిసి ఆయన వెళ్లనున్నట్లు తెలిసింది. జగన్ కుమార్తెలిద్దరూ ఉన్నత విద్య నిమిత్తం లండన్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తన కుమార్తెలను కలుసుకోవడానికి వెళుతున్న జగన్ ఐదు రోజుల పాటు అక్కడే గడపనున్నారు.
జగన్ లండన్ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్కు 22వ తేదీ రాత్రికి చేరుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ తిరిగి హైదరాబాద్ వచ్చిన అనంతరం బస్సు యాత్రకు కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని వైసీపీ భావిస్తోంది.
- Advertisement -