అమరావతి: బీజేపీ, ప్రధాని మోడీలపై టీడీపీ నాయకురాలు సాధినేని యామిని తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఓ మీడియా చానల్ చర్చా వేదికలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ…. బీజేపీ దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, చివరకు సీఈసీపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టేలా బీజేపీ చేసిందని విమర్శించారు.
ఇక ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు…అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇలాంటి పనులు చేస్తారని, బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారని యామిని ఫైర్ అయ్యారు.
ఇక మొన్న వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొన్న పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయంపై ఆమె స్పందిస్తూ… నాడు గుజరాత్లో అమిత్ షా మంత్రిగా వున్న సమయంలో ఎన్నో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు.
చదవండి:
ఇక ఇప్పుడు అమిత్ షా సాధుపుంగవుడని బీజేపీ భావిస్తుండటం చాలా దారుణమని విమర్శించారు. రాలుష్ట్రా, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ అనుసరిస్తున్న తీరు సరికాదని అన్నారు. అలాగే కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఉండే స్ఫూర్తిని మోదీ దెబ్బతీశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.