జనసేన మూడో జాబితా: ఒక లోక్‌సభ, 13 అసెంబ్లీ అభ్యర్థులు వీరే

- Advertisement -

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల 3వ జాబితాను సోమవారం రాత్రి విడుదల చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ జాబితాలో ఒక లోక్ సభ అభ్యర్థి, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

ఇక ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలోని ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేశారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు.

కాగా, ఈ జాబితాలో కూడా పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది తేలకపోవడం గమనార్హం. అయితే, పవన్ కళ్యాణ్ గాజువాకతోపాటు మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

లోక్ స‌భ అభ్యర్థి: ఒంగోలు – శ్రీ బెల్లంకొండ సాయిబాబు

శాస‌న‌స‌భ అభ్యర్ధులు:

1. టెక్కలి – క‌ణితి కిర‌ణ్ కుమార్
2. పాల‌కొల్లు – గుణ్ణం నాగ‌బాబు
3. గుంటూరు ఈస్ట్ – షేక్ జియా ఉర్ రెహ్మాన్
4. రేప‌ల్లె- క‌మ‌తం సాంబ‌శివ‌రావు
5. చిల‌క‌లూరిపేట – మిరియాల ర‌త్నకుమారి
6. మాచ‌ర్ల – కె. ర‌మాదేవి
7. బాప‌ట్ల – పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి
8. ఒంగోలు – షేక్ రియాజ్
9. మార్కాపురం – ఇమ్మడి కాశీనాధ్
10. గిద్దలూరు – బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్
11. పొద్దుటూరు – ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి
12. నెల్లూరు అర్బ‌న్ – కేతంరెడ్డి వినోద్ రెడ్డి
13. మైదుకూరు – పందిటి మ‌ల్హోత్ర‌
14. క‌దిరి – సాడ‌గ‌ల ర‌వికుమార్ (వ‌డ్డె ర‌విరాజు )

 

- Advertisement -