చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

- Advertisement -

“చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే బీసీలపై వైసీపీ దాడులు చేస్తోందని అంటున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే.. రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు.

ప్రతీది ఆరోపణ చెయ్యడం టీడీపీ అలవాటుగా మారిపోయింది” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.

 

రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆయన విమర్శించారు.

పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

గత ప్రభుత్వం హయాంలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు.

అవినీతి, దళారి వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తోందని తెలిపారు.

జగన్ గారు రెడీ అంటే 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారని, జగన్ గారి దయవల్లే టీడీపీ బ్రతికి ఉందని పేర్కొన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

‘అచ్చెన్నాయుడు మీద ఉన్న ప్రేమ.. కోడెలపై ఎందుకు లేదు.

ఆయన ఆత్మహత్య కు చంద్రబాబు కారణం కాదా..? ఎర్రం నాయుడుకు స్పీకర్ పదవి వస్తుంటే వద్దన్నది చంద్రబాబు కాదా..?

అచ్చెన్నాయుడు బలహీన వర్గాలకు, బీసీ లకు నాయకుడు కాదు.

తెలుగుదేశం పార్టీ లో బీసీ కుల నేతలుగా చెప్పుకుంటున్న నేతలు తమ కులాలకు ఎం చేశారు?

బీసీలకు వైసీపీ న్యాయం చేస్తుంది” అని దాడి వీరభద్రరావు అన్నారు.

ఎన్టీఆర్ హయాంలోనే టిడిపి బీసీ పార్టీగా ఉందని, బాబు హయాంలో కేవలం డబ్బున్నోళ్ల పార్టీగా మారిందని చెప్పారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని, గతంలో ట్రాన్స్ పోర్ట్ అధికారులపై దాడులు చేశారని తెలిపారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అవుతున్నారని, తన హయాంలో మంత్రులు అవినీతి చేస్తే దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధ్యుడేనని చెప్పారు.

చంద్రబాబు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలనన్నారు.

అవినీతిపరులపై జగన్ గారు యుద్ధం ప్రకటించారని, అవినీతిపై పోరాటం చేసే ప్రభుత్వం కు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

తన మనుషులను దళారులు గా తయారు చేసి, తమ కార్యకర్తలను ఆందోళనలు చెయ్యాలని చంద్రబాబు చెబుతున్నారన్నారు.

అచ్చం నాయుడు వెనుక ఎవరు ఉన్నారో ఆయనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

అవినీతి రహిత పాలనలో భాగంగానే జగన్మోహనరెడ్డి అవినీతి నేతల పని పడుతున్నారని తెలిపారు.

అవినీతిని బయట పెడితే కక్షసాధింపు అంటున్నారని, ఏ టైమ్ లో అరెస్ట్ చెయ్యమంటారో మీరే చెప్పండని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.

- Advertisement -