- Advertisement -
వాషింగ్టన్: కరోనా విజృంభణ తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓక్లహామాలోని టుస్లాలో ఈ ర్యాలీ జరగనుంది.
బీవోకే సెంటర్లో ట్రంప్ సభ జరగనుంది. దీనిలో కనీసం 19వేలమంది కూర్చునే సదుపాయం ఉంది. ఈ ర్యాలీలో పాల్గొనే వారికి అధ్యక్షుడి క్యాంపెయిన్ వెబ్సైట్ ఓ వింత రూల్ పెడుతోంది.
అదేంటంటే, ర్యాలీలో పాల్గొనే అభిమానుల్లో ఎవరికైనా కరోనా సోకితే, వారెవరూ ట్రంప్పై కోర్టుకెళ్లకూడదట. దీనికి ఒప్పుకుంటేనే ర్యాలీలో పాల్గొనాలని సదరు వెబ్సైటులో అధికారులు పేర్కొన్నారు. ఈ హెచ్చరిక చూసిన ప్రజలు.. ఇదేం వింత నిబంధన? అంటూ షాకవుతున్నారు.
- Advertisement -