న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్యపై నెటిజన్లు మళ్లీ విరుచుకుపడ్డారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఫొటోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతమంది బాగున్నారు అంటూ మెచ్చుకోగా మరికొందరు అదేం ఫొటో అంటూ హసిన్ జహాన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కోల్కతాకు చెందిన హసీన్ జహాన్, షమీ ఏప్రిల్ 7, 2014న వివాహం చేసుకున్నారు. అయితే ఆ మధ్య వీరి కాపురంలో కలతలు రేగాయి. దీంతో హసీన్ చాలా కాలంగా తన భర్త నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం హసీన్ జహాన్ తన భర్త షమీపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని కూడా ఆమె ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను ఆమె నిరూపించలేకపోయారు.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా విడాకులు మాత్రం తీసుకోలేదు.
అయితే క్రికెటర్ షమీ భార్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో హసీన్ జహాన్కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
వివాదాస్పదంగా మారిన ఫొటో…
ఈ నేపథ్యంలో తరచూ లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలతో తన అభిమానులను ఆమె అలరిస్తుంటారు. ఈ క్రమంలో హసీన్ బుధవారం తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటో కాస్త వివాదాస్పదంగా మారింది.
సదరు ఫొటోలో హసీన్ జహాన్.. కింద తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, పైన బ్లాక్ టాప్ ధరించి ఉన్నారు. చెప్పాలంటే ఈ క్లోజప్ ఫోటోలో హసీన్ కాస్త బోల్డ్గానే దర్శనిమిచ్చారు.
దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ ఫోటో చూసిన కొందరు ‘‘హసీన్ చాలా అందంగా ఉన్నారు’’ అంటూ ప్రశంసించగా.. అధిక శాతం మంది మాత్రం ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
‘‘పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా?’’ అంటూ హసీన్పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
View this post on Instagram