హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్లో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ మహిళ తమ ఇద్దరు పిల్లలతో కలిసి శక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే … వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన స్రవంతికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి సాయితేజ(9), సాత్విక(7) ఇద్దరు సంతానం. కుటుంబ కలహాల కారణంగా ఏడు సంవత్సరాల క్రితం భర్త నుంచి విడిపోయి ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. తల్లిదండ్రులు, పెద్దలు భర్త వద్దకు తిరిగి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. తన భర్తకు పిచ్చి ఉందని అతని దగ్గరికి వెళ్లడానికి నిరాకరించింది.
ఏమైందో గానీ స్రవంతి.. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ విషం తాగింది. ఇద్దరు పిల్లలు చనిపోయాక… స్రవంతి చనిపోవకపోవడంతో పక్కనే ఉన్న కరెంట్ హీటర్ పట్టుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు
ఈ ఘటనలో స్రవంతితోపాటు ఆమె కుమారుడు సాయితేజ్ (10), కుమార్తె సాత్విక (7) కూడా మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.