గ్రేట్: సిద్ధిపేటలో హరీష్ రావు విజయదుందుభి.. దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయి మెజారిటీతో…

minister harish rao victory is first ever in-indian assembly election history
- Advertisement -

minister harish rao victory is first ever in-indian assembly election history

హైదరాబాద్: డిసెంబర్ 7న పోలింగ్ వేళ మంత్రి హరీష్ రావుతో..  కేటీఆర్ ‘‘బావా నీకు లక్ష మెజార్టీ ఖాయమటగా..’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమయ్యాయి. ఈ తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు రికార్డు స్థాయిలో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

హరీష్ రావు తాజా ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించడమేకాదు, ప్రతి ఎన్నికకూ ఆయన మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించి, శాసనసభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ రానంత మెజార్టీ తెచ్చుకున్నారు.

ఇప్పటి వరకూ శాసనసభ ఎన్నికల్లో ఎవరూ సాధించని విధంగా 1,20,650 ఓట్ల మెజారిటీతో ఎవరికీ సాధ్యంకాని రీతిలో గెలుపు సాధించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి, టీజేఎస్ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై హరీష్ విజయన్ని అందుకున్నారు. 2004 ఉపఎన్నికల్లో సిద్ధిపేట నుంచి తొలిసారి పోటీచేసిన హరీష్ రావు 24,594 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

అనంతరం 2008 ఉప ఎన్నికల్లో తన మెజార్టీని రెండింతలకు పెంచుకుని 58,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే 2009 సాధారణ ఎన్నికల్లో 64,667, 2010 ఉప ఎన్నికల్లో 93,858, 2014 సాధారణ ఎన్నికల్లో 95,328 ఓట్ల మెజార్టీతో ఆయన విజయదుందుభి మోగించారు.

మరోవైపు, టీఆర్‌ఎస్ పార్టీకి సిద్దిపేట కంచుకోటగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటినుంచి ఓటమి అన్నదే లేకుండా ఆధిక్యతను పెంచుకుంటూ పోతున్నారు. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీశ్ రావు దక్కించుకోవడం గమనార్హం.

- Advertisement -