
న్యూఢిల్లీ: నీట్ 2019 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం నాడు ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నళిని ఖేండల్ వాల్ ప్రథమ ర్యాంకు సాధించారు. అలాగే తెలంగాణ విద్యార్ధికి 7వ ర్యాంకు, ఏపీ విద్యార్ధికి 16వ ర్యాంకు దక్కింది.
720 మార్కులకు గాను 701 మార్కులను నలిని ఖేండల్వాల్ సాధించారు. ఢిల్లీకి చెందిన భవిక్ బసంత్ 700 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. యూపీకి చెందిన అక్షాంత్ అక్షార్ కౌశిక్ అనే విద్యార్ధికి కూడ 700 మార్కులు వచ్చాయి. ఆయనకు మూడో ర్యాంకు కేటాయించారు.
ఏపీలో 72.55 శాతంతో 39.039 మంది ఉత్తీర్ణులు కాగా, తెలంగాణలో 68.88 శాతంతో 33,044 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, నీట్ ఫలితాల్లో టాప్ 50లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు స్థానం సంపాదించారు.
తెలంగాణ విద్యార్ధిని జి. మాధురిరెడ్డికి ఏడో ర్యాంకు దక్కింది.మాధురిరెడ్డికి 695 మార్కులు వచ్చాయి. ఏపీకి చెందిన ఖురేషీ అస్రాకు 16వ ర్యాంకు దక్కింది. అస్రాకు 690 మార్కులు వచ్చాయి.టాప్ 50 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు 4 ర్యాంకులు వచ్చాయి








