సన్నీ లియోన్ పక్కన విరాట్ కోహ్లీ! అసలు విషయం ఇదే!

- Advertisement -

ముంబై: పైన ఉన్న ఈ ఫోటో చూశారుగా, ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న వీడియో కూడా చూడండి… నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్టుకు ఎప్పుడు వచ్చాడా అని అనుకుంటున్నారా.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అదే అనుకున్నారు. సన్నీలియోన్, విరాట్ కోహ్లీ కలిసి వచ్చారని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ కూడా అనుకున్నాడట. ఆయనతో పాటు ముంబై ఎయిర్ పోర్ట్ బీట్ చూసే విలేకరులు సైతం అదే అనుకున్నారు.

దగ్గరికి వెళ్లి చూసిన తరువాతే వారికి అసలు విషయం తెలిసింది. అతని పేరు రజానీ. సన్నీ లియాన్ కు మేనేజర్. వారిద్దరినీ వీడియో తీసిన విరాల్, “ఇతన్ని చూసి కోహ్లీ మ్యాచ్‌ కోసం ముంబై వచ్చాడని అనుకున్నాను” అని కామెంట్ పెట్టాడు. మూడు గంటల వ్యవధిలో ఈ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షించారు. రజానీ అచ్చం కోహ్లీలా కనిపిస్తున్నాడని కితాబిస్తున్నారు.

చదవండి: రణబీర్, ఆలియా భట్ వెడ్డింగ్ కార్డ్ లీక్..పెళ్లి ఎప్పుడో తెలుసా?

- Advertisement -