హైదరాబాద్: ప్రస్తుతం తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ సినిమాకు కీలమైన ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన డైసీ ఎడ్గార్జోన్స్ కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈమె కోసం రాజమౌళి కథను కూడా మార్చబోతున్నాడట.
ఒకవేళ శ్రద్ధ కపూర్ కూడా తప్పుకుంటే.. ఆమె స్థానంలో పరిణితి చోప్రాని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అప్పుడు కూడా కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉందట.
ఇప్పటికే హీరోయిన్ హ్యాండివ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్న జక్కన్నకి మళ్ళీ హీరోయిన్ల కోసం కథలో మార్పులు చేయడం.. పెద్ద తలనొప్పిగా మారిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
సంబంధిత వార్తలు
ఏమైంది?: ‘RRR’లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న డైసీ ఎడ్గార్ జోన్స్!
ఆర్ఆర్ఆర్ గురించి ఎన్టీఆర్ బయటపెట్టిన మరో సీక్రెట్
RRR లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్
ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ…ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు?
రాజమౌళి చెప్పిన ఆర్ ఆర్ ఆర్ సీక్రెట్!
జూలై 30, 2020…ఇప్పట్లో ఫస్ట్ లుక్, టీజర్స్ లేవు!
ముగ్గురి ఫొటో వెనక కథ గురించి చెప్పిన రామ్ చరణ్