బాపినీడు మృతిపై చిరంజీవి, మోహన్‌బాబు సంతాపం!

- Advertisement -

vijaya-bapineedu_ passed away ....

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతిపట్ల సినీ నటుడు మంచు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ బాపినీడు గారి మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు.

ఆయనతో పరిచయం ఇప్పటిది కాదని, 1990 నుండి బాపినీడు గారితో పరిచయం ఉందని అన్నారు. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు ఒకరని చెప్పారు. మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుండి బాపినీడుతో తనకు సాన్నిహిత్యం ఉందని, ఎంతో మృదుస్వభావం గల వ్యక్తి అని అన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…విజయ బాపినీడు మృతి బాధ కలిగించింది. ఆయనతో ఆరు సినిమాలు చేశా. ఆయన నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు. బాపినీడు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు

ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

chiru , newsxpress.online

- Advertisement -