హైదరాబాద్: బిగ్ బాస్ 2′ లో కౌశల్ విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీలోని కొంతమంది సభ్యులు, రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి కౌశల్పై అనేక ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అందుకు ప్రతిస్పందిస్తూ కౌశల్ కూడా మీడియా ముందుకు వచ్చాడు.
అభిమానులకే సమయం కేటాయించాను…
‘బిగ్ బాస్ 2’ నుంచి బయటికి వచ్చాక నేను నా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి కూడా వెళ్లలేదు. సినిమాలను కూడా పక్కన పెట్టేసి, నా గెలుపునకు కారణమైన నా అభిమానులతోనే గడుపుతూ వచ్చాను. నాపై అభిమానంతో ఎవరు వచ్చి ఆహ్వానించినా వెళ్లి కలిశాను. నాకు కావలసింది అభిమానమే గానీ, డబ్బు కాదు., అని కౌశల్ తెలిపాడు.
అంతేకాదు… ‘‘నాపై ఆరోపణలు చేస్తున్నవారి మాటల్లో నిజానిజాలను గురించి తెలుసుకోకుండా, కొన్ని టీవీ చానల్స్ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఒక వైపున సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ప్రసారం చేయాలిగానీ, టీఆర్పీల కోసం నా పేరును వాడుకుని నా జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు,,” అంటూ అతడు ఆవేదనను వ్యక్తం చేశాడు.
చదవండి: ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి ఏం చెప్పాడో తెలుసా?