హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా….కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు ‘రూలర్ ‘ టైటిల్ పెట్టారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ టైటిల్ని పక్కనబెట్టి చిత్రబృందం వేరే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరుగుతుంది. ఇక ఇందులో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ పాత్ర కొంచెం అటు ఇటు గా టెంపర్లో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందని టాక్. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్న ఈచిత్రానికి సి కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే బాలయ్య-కెఎస్ రవి కుమార్ కాంబినేషన్లో 2018 సంక్రాంతికి వచ్చిన జై సింహా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ వీరి కాబినేషన్లో వస్తున్న ఈ క్రాంతి….సక్రాంతికి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.