డేటింగ్ చేసి విడిపోయాక అత్యాచారం చేశాడంటే ఎలా కంగనా..?

- Advertisement -

ముంబై : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ … పరిచయం అక్కర్లేని పేరు. ఒక నటిగా తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకుందో… వివాదాలతోనూ అంతే గుర్తింపు సంపాదించింది. హీరో హృతిక్ రోషన్, డైరెక్టర్ కరణ్ జోహార్ లతో పాటు చాలా మందిపై చాలా రకాలుగా విమర్శలు చేసి వివాదాలకు తెరతీసింది. బాలీవుడ్‌ నటి జరీనా వాహబ్‌ భర్త ఆదిత్య పంచోలీ విషయంలోనూ ఓ వివాదాన్ని తెరమీదకి తీసుకొచ్చింది.

చదవండి:మహానటి రీల్ లైఫ్ ఒక పాఠం… రియల్ లైఫ్ గుణపాఠం

ఆదిత్య పంచోలీ తనను వేధించాడంటూ గతంలో కామెంట్స్ చేసింది కంగనా. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన జరీనా వాహబ్.. తన భర్త అలాంటి వాడు కాదని చెప్పింది. డేటింగ్ చేసి విడిపోయాక లైంగికంగా వేధించారని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించింది. ఇలాంటి ఆరోపణలు చాలా తప్పని .. భవిష్యత్తులోనూ ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని హెచ్చరించింది.

13 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయంలో కంగనాపై కేసు పెట్టాడు ఆదిత్య. ఇప్పటికీ ఈ కేసు నడుస్తుండగా… ఆదిత్య భార్య జరీనా వాహబ్‌ చేసిన కామెంట్స్ తో మళ్లీ తెరమీదకి వచ్చింది. మరి కంగనా ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

- Advertisement -