న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తోన్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఆ పార్టీకి ప్రతికూల పవనలు వీస్తున్నాయి.
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రలలో నాలుగోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కాషాయ పార్టీకి ఆ రాష్ట్ర ఓటర్లు షాక్ ఇచ్చారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకు గానూ కాంగ్రెస్ 116 స్థానాల్లోనూ, బీజేపీ 101 చోట్ల, బీఎస్పీ 5, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రాజస్థాన్లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికల జరగ్గా కాంగ్రెస్ 99 స్థానాల్లోనూ, బీజేపీ 76 స్థానాల్లోనూ, ఇతరులు 19 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఇక చత్తీస్గఢ్లోని 90 స్థానాలకు గానూ 57 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
చత్తీస్గఢ్లో 2003 తర్వాత అధికారం కాల్పోయిన కాంగ్రెస్ ప్రస్తుత ఈ ఎన్నికల్లో విజయం దిశగా సాగడంతో తిరిగి పగ్గాలు చేపట్టనుంది. పోలింగ్ అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం చత్తీస్గఢ్లో తల్లకిందులయ్యాయి.
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకుందని, హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే రాజస్థాన్లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్లో హస్తం, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉంటుందని పేర్కొన్నాయి.
అయితే, ప్రస్తుతం ఫలితాల సరళి మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంది. 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలో కాంగ్రెస్ వరుస పరాజయాలతో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయింది. అయితే, ప్రస్తుతం ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓ ఆక్సిజన్లా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని పార్టీ వర్గలు భావిస్తున్నాయి.