140 కోట్లు దాటిన ‘మహర్షి’ బిజినెస్!

maharshi
- Advertisement -

హైదరాబాద్: భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఇప్పుడు ‘మహర్షి’తో టాలీవుడ్ ముందుకు రానున్న మహేశ్ బాబు, సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టేశారు. ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో రికార్డును సృష్టిస్తూ, రూ. 140 కోట్లకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇదివరకు ఎన్నడూ కనిపించనంత అంకెలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. వచ్చేనెల 9న విడుదల కానున్న సినిమాకు డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలోనే రూ. 47.50 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదే సమయంలో తెలుగు శాటిలైట్ హక్కుల రూపంలో రూ. 14.5 కోట్లు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులకు రూ. 20 కోట్లు, ఆడియో హక్కులకు రూ. 2 కోట్లు, ఓవర్ సీస్ లో సుమారు రూ. 12.5 కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది.

ఇక ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాల హక్కులను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 140 కోట్లకు పైనేనని సమాచారం. టాలీవుడ్ ప్రిన్స్ కెరీర్ లో ఇది ఆల్ టైమ్ రికార్డు కాగా, ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందాల నటి పూజా హెగ్డేతో పాటు అల్లరి నరేశ్ కూడా ఇందులో నటిస్తున్నారు.

- Advertisement -