23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home క్రికెట్ పోలీసుల టార్చర్ వల్లే ఒప్పుకున్నా: స్పాట్ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్, బీసీసీఐకి ఎందుకు చెప్పలేదన్న సుప్రీం

పోలీసుల టార్చర్ వల్లే ఒప్పుకున్నా: స్పాట్ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్, బీసీసీఐకి ఎందుకు చెప్పలేదన్న సుప్రీం

sreesanth
- Advertisement -

sreesanth

న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల టార్చర్‌ భరించలేకే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని, తాను మాత్రం ఏ తప్పు చేయలేదని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపారు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.

దీనిపై మాజీ పేసర్‌ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు. బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కె.ఎమ్‌.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ఈ కేసును విచారించింది. పోలీస్‌ టార్చర్‌ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్‌ నిందను మోసాడాని అతని లాయర్‌ కోర్టుకు వివరించారు.

శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించినమాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల వలలో పడలేదని దీనికి సంబంధించిన మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్‌ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదించారు.

శ్రీశాంత్ ప్రవర్తన సరిగా లేదు: సుప్రీం

కాగా, దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ… బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్‌ ఆ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్‌ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్‌ క్యారెక్టర్‌ ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని, ఆయన ప్రవర్తన సరిగా లేదని బెంచ్‌ తేల్చి చెప్పింది.

- Advertisement -