28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…

Janasena Chief Pawan Kalyan Tweet on Vizag Chemical Gas Leakage Incident
- Advertisement -

అమరావతి: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న రసాయన వాయువు లీకేజి ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

ఈ దుర్ఘటనలో 10 మంది మరణించడం.. అలాగే వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయ విదారకం అంటూ ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. 

ఈ మేరకు ఒక ట్వీట్ చేసిన జనసేనాని.. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ బాధ్యతగా మెలగాలని జనసేనాని హితవు పలికారు.

చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…
- Advertisement -