- Advertisement -
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నేటినుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే.. అక్టోబర్ 31, నవంబరు 1న రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -