
ఆయన కొద్ది కాలం క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త వచ్చింది. ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల పార్టీ మార్పుపై మాట్లాడిన సాయిప్రతాప్ తాను మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరలేదన్నారు. రాష్ట్ర విభజన తీరుతో మనస్తాపం చెంది కాంగ్రెస్ను వీడానన్నారు. కాంగ్రెస్ పెద్దల పిలుపు మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
తానకు పదవులపై ఆశలేదని, చివరి వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చే స్తానని సాయిప్రతాప్ వెల్లడించారు. జగన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినవారేనని గుర్తు చేశారు.








