నేడు తెలుగు సీఎంల ‘ఏకాంత భేటీ’! ఏమేం చర్చించనున్నారంటే…

- Advertisement -

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ నేటి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ భేటీ ఏకాంతంగా జరగనుందని, మంత్రులు, అధికారులు కూడా వారి వెంట ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

చర్చకు ఏయే అంశాలు అంటే…

గతేడాది సెప్టెంబరు 23న ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం, కేంద్ర సహకారం లేకపోవడం, రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

రాయలసీమకు నీళ్లందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలన్న జగన్ నిర్ణయంపై తెలగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది.

9,10 షెడ్యూల్ సంస్థల విభజన, డీఎస్పీల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు సమాచారం. సీఎంలు ఇద్దరూ హైదరాబాద్‌ వేదికగా ఇప్పటికే మూడుసార్లు వారు కలిశారు. ఇది నాలుగోది.

- Advertisement -