జగన్‌కి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి: మోహన్ బాబు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం దూసుకుపోతున్న నేపథ్యంలో నటుడు మోహన్ బాబు స్పందించారు. జగన్‌కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ధైర్యసాహసాలు ఇచ్చారని కొనియాడారు. అలాగే, జగన్‌కు ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుంది. ఇక టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఉండగా…జనసేన  ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. అటు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీడీపీ 1 స్థానంలో లీడింగ్ ఉంది.

అటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకి గాను 9 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎం‌ఐ‌ఎం 1 స్థానంలో ఆధిక్యం ఉంది.

దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీయే 334 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూపీఏ 86 స్థానాల్లో, ఇతరులు 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -