కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు రంగంలోకి.. కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్ల సర్దుబాట్లు…

Mahakutami3
- Advertisement -

Mahakutami8

హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలూ పట్టువిడుపులను ప్రదర్శించడం, ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల అధిష్ఠానాలు రంగంలోకి దిగడంతో సమస్య సద్దుమణిగింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో పోటీ చేయనుంది. మిత్రపక్షాల్లో తెలుగుదేశం పార్టీకి 15 స్థా నాలు , టీజేఏసీకి 10 స్థానాలు, సీపీఐకి 4 స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలియజేయడంతో.. మహాకూటమి భాగస్వామ్య పక్ష పార్టీలు కూడా సమ్మతించినట్టు సమాచారం.

మహాకూటమి తొలి జాబితాలో దాదాపు 60 మంది పేర్లు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున 40 నుంచి 50 మంది పేర్లు, టీడీపీ నుంచి 8, టీజేఎస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తూ, మొత్తం జాబితాలో 35 బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉండేలా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ భావిస్తోందని అభిజ్ఞవర్గాల భోగట్టా.

నేడో, రేపో సీట్ల సంఖ్యపై అధికారిక ప్రకటనను మహాకూటమి నేతలు వెలువరించనున్నారు. తామంతా ఐక్యమత్యంగా ఉన్నామన్న సంకేతాలను వెలువరుస్తూ అభ్యర్థుల పేర్లను ఉమ్మడిగా ప్రకటిస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న లోక్ సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మహాకూటమి నేతలు అంటున్నారు.

వివిధ సర్వేల ఆధారంగా, ప్రతి సీటు నుంచి బలమైన అభ్యర్థిని.. తప్పక గెలిచే వ్యక్తినే ఎంపిక చేయాలని అన్ని పార్టీలూ ఓ నిర్ణయానికి వచ్చాయి.

 

- Advertisement -