
- Advertisement -
అమరావతి: జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐదు రోజుల పనిదినాల వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సచివాలయం, హెచ్వోడీ (శాఖాధిపతుల కార్యాలయాలు) ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
గత ఉత్తర్వుల ప్రకారం ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27తో ముగియనుండగా, ఇప్పుడు దీనిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వులపై సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
- Advertisement -








