
- Advertisement -
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా అనాగరిక పాలన నడుస్తోందని, ముఖ్యంగా ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు వరప్రసాద్పై జరిగిన దాడే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో డిమాండ్ చేశారు.
- Advertisement -








