ఇది 2009 కాదు.. 2019: యామిని మల్లె పూల వ్యాఖ్యలకు జనసేనాని స్ట్రాంగ్ కౌంటర్!

- Advertisement -

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి, మహిళా నాయకురాలు సాధినేని యామిని.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మల్లెపూలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారమే లేపింది. అయితే యామిని తనపై అప్పట్లో చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించారు.

పల్నాడులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ జనసైనికుల్ని అరెస్టు చేసి చచ్చిపోయేలా కొడతా ఉంటే తమకు ఎంతో ఆవేదనగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

‘‘టీడీపీ నాయకులకు, నాపై కామెంట్లు చేసిన ఆ నాయకురాలికి నేను ఒకటే చెబుతున్నా, నేను మిమ్మల్ని గౌరవిస్తాను.. మీరు నన్ను విమర్శించండి.. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఖండించండి..’’ అని అన్నారు. 

ఇది 2009 కాదు 2019 …

అంతే తప్ప పిచ్చి పిచ్చిగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ‘‘అసలు నా వ్యక్తిగత జీవితం గురించి మీకు ఏం తెలుసు? అంత పెద్ద విలువలు ఉన్నాయా మీ అందరికీ? నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయా..?’’ అని యామినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

అంతేకాదు, ‘‘2014లో నేను మిమ్మల్ని నా భూజాలపైన ఎత్తి గెలిపించాను. ఆ రోజు మీ జెండాలు మోసింది మా జనసైనికులు కాదా? ఇప్పుడు వారి మీద కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతారా?’’ అంటూ పవన్ ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు గొడవలకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు.. గుర్తుపెట్టుకోండి అని కూడా ఆయన హెచ్చరించారు.

ఇక పవన్ తన ప్రసంగంలో మంత్రి నారా లోకేష్‌ను కూడా కడిగిపారేశారు.. ‘‘సర్పంచ్‌గా కూడా గెలవని వ్యక్తి లోకేష్.. మంత్రి అయ్యాడంటే అందులో వాస్తవం ఉంది. తప్పుంటే ఖండించండి..’’ అని వ్యాఖ్యానించారు. ఇక చివరగా.. ‘‘పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఊరుకోను.. ఇది 2009 కాదు.. 2019..’’ అని పవన్ హెచ్చరించారు. మరి పవన్ వ్యాఖ్యలకు మళ్లీ యామిని ఎలా స్పందిస్తారో చూడాలి!

చదవండి :చంద్రబాబుకి మైండ్ బ్లోయింగ్ షాక్! వైసీపీలోకి ఆ కీలక నటి!

- Advertisement -