- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.
కేసీఆర్పై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషన్లో పేర్కొన్నారు. గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే ఓటర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
నాలుగు వారాల్లో వివరణ ఇవ్వండి…
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని శ్రీనివాస్ కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
చదవండి: కేటీఆర్ బెదిరిస్తున్నారు: నారా లోకేష్ సంచలన ఆరోపణలు
- Advertisement -