
ఢిల్లీ: చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు జెడ్టిఈ సంస్థ తన నూతన స్మార్ట్ఫోన్ బ్లేడ్ ఎ7ని తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే దీన్ని భారత్ మార్కెట్లో విడుదల చేయనుంది. 3 జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ ధర రూ. 6100 గా ఉంది.
జడ్టీఈ బ్లేడ్ ఎ7 ఫీచర్లు…
6 ఇంచుల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 4జీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.
చదవండి: అదిరిపోయే ఫీచర్లతో రియల్ మి3 నుంచి కొత్త వేరియంట్ విడుదల….
షియోమీ నుంచి గేమింగ్ ఫోన్
షియోమీకి చెందిన బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్ఫోన్ను త్వరలో భారత్లో విడుదల చేయనున్నారు. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
షియోమీ బ్లాక్ షార్క్ 2 ఫీచర్లు…
6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, లిక్విడ్ కూలింగ్ 3.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.







