ముంబై: గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో ముంబై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులే చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.
దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో బుమ్రా అద్భుత బౌలింగ్తో సన్రైజర్స్ 8పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఇక 9 పరుగుల టార్గెట్ని పాండ్యా, పొలార్డ్లు సులువుగా చేధించారు. దీంతో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టి ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఆఫ్స్లో చోటు ఖాయం చేసుకుంది.
ఇక ముంబై బ్యాట్స్మన్లో క్వింటన్ డికాక్ 58 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా నిలవగా..రోహిత్ 24, సూర్యకుమార్ యాదవ్ 23 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (3/42) ఆకట్టుకున్నాడు. అటు హైదరాబాద్లో మనీశ్ పాండే 47 బంతుల్లో 71 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. నబీ 31 పరుగులు చేశాడు. బుమ్రా, పాండ్యా బ్రదర్స్ తలా 2 వికెట్లు తీశారు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి:కోహ్లీ కెప్టెన్సీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గంభీర్….