- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలో మూడు రోజులు పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జులై 29 ఉదయం 6 గంటల నుంచి జులై 31 వరకు నగరంలో శ్రీ ఉజ్జయిని మహాంకాళి జాతర వేడుకలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, క్లబ్లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.
పోలీసుల ఆదేశాల మేరకు మధ్య మండలం, ఉత్తర మండలంలోని చిలకలగూడ, గోపాలపురం, లాలాగూడ, మహంకాళి, తుకారాంగేట్, కార్ఖానా, మారేడ్పల్లి, బేగంపేట్, రాంగోపాల్పేట్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఆదివారం నుంచి మూతపడనున్నాయి.
- Advertisement -