గోదావరి నదిలో ఘోర దుర్ఘటన.. మునిగిన బోటు.. 10 మంది మృతి.. 49 మంది గల్లంతు

- Advertisement -

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి ఘటనలో 10మంది మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 49 మంది గల్లంతయ్యారు.

బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో పాపికొండలకు వెళ్తుండగా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల బోటుకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.

రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

బోటు దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలికి బయలుదేరారు.

ప్రమాదానికి గురైనది పర్యటక బోటు కాదని, అది వశిష్ట అనే ప్రైవేటు కంపెనీకి చెందిన బోటు అని పేర్కొన్నారు. దానికి అనుమతులు లేవని తెలిపారు.

టూరిజం శాఖ అనుమతి ఇవ్వలేదని, కాకినాడ పోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

- Advertisement -