వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం!

naidu-modi-collage
- Advertisement -

అమరావతి: ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారా? దీనికి సమాధానంగా ‘ఔను’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా చంద్రబాబు వెళతారని, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని చెప్పారు.

మోడీ ద్రోహాన్ని, కుయుక్తులను వారణాసి వేదికగా ఎండగడతారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అంతేకాదు, ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23వ తేదీన టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని బుద్ధా వెంకన్న అన్నారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

దేశ చరిత్రలో ఏన్నడూ రానంతగా ఈసీపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని… దీనికి కారణం ఇది మోడీ నియమించిన ఈసీ కావడమేనని చెప్పారు. ఈసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలను తెగబడిందని అన్నారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీకే మోడీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్‌మెంట్ ఇస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.

- Advertisement -