ఏపీ సీఎస్‌పై మండిపడ్డ యామిని! ‘‘వైసీపీ నేతలను ప్రజలే తరిమికొడతారు..’’

- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాదినేని తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను పావుగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో మహిళలకు పసుపు-కుంకుమ డబ్బులు ఎవరికీ అందకుండా సీఎస్ కుట్రలు చేస్తున్నారని యామిని ఆరోపించారు. ఎంతో మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే వారిని తరిమి కొడతారంటూ వ్యాఖ్యానించారు.

తిరుమల వెంకటేశ్వరస్వామి బంగారంపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ్యుడ్నన్న జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, ఆ పలితాలతో వైసీపీ నేతలకూ ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది యామిని.

- Advertisement -

2 COMMENTS

Comments are closed.