న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తనకున్న 51 శాఖలను దేశం వ్యాప్తంగా మూసివేస్తుంది. బ్యాంకింగ్ పరిశ్రమలో తాజాగా అమలు చేస్తున్న వ్యయ కోత చర్యల్లో భాగంగా తమ 51 శాఖలను మూసివేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ముసివేసే అన్ని శాఖలు కూడా పట్టణలకు చెందినవే. భారీ నష్టాలు సంభవింస్తూ.. అసమర్థంగా ఉన్న శాఖలను గుర్తించామని వాటిలోని 51 శాఖలల్లో కొన్నింటిన్నీ పూర్తిగా మూసివేస్తుండగా…. కొన్నింటిన్నీ పక్క శాఖలల్లో విలీనం చేస్తున్నారు.
ఈ శాఖలల ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లను కూడా అధికారులు రద్దు చేశారు. డిసెంబర్ 31 నుండి శాశ్వతంగా పాత ఐఎఫ్ఎస్సీ /ఎంఐసీఆర్ కోడ్లను రద్దు చేసి… అప్పటి నుండి బ్యాంక్ లావాదేవీలన్ని కొత్త ఐఎఫ్ఎస్సీ /ఎంఐసీఆర్ కోడ్లతోనే జరపల్సి ఉంటుంది. అన్ని సేవింగ్స్ అకౌంట్లను, కరెంట్ అకౌంట్లను, ఇరల బ్యాంక్ అకౌంట్లను విలీనం చేసిన శాఖలకు బదిలీ చేశామని అధికారులు తెలిపారు. ఈ నవంబర్ 30 వరకు కస్టమర్లందరూ పాత ఐఎఫ్ఎస్సీ ఇంకా ఎంఐసీఆర్ కోడ్లతో ఉన్న పాత చెక్ బుక్లను మూతపడే శాఖలలో డిపాజిట్ చేయాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. అలాగే కొత్త బ్రాంచుల వద్ద ఐఎఫ్ఎస్సీ /ఎంఐసీఆర్ కోడ్లతో ఉన్న తమ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను తీసుకోవాలని తెలిపింది.