బీజింగ్: చైనాకు చెందిన బుల్లి వ్యోమనౌక లాంగ్జియాంగ్-2 శుక్రవారం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి అంతమైంది. దీంతో దాని ప్రస్థానం ముగిసింది. లాంగ్జియాంగ్-2 నిర్దేశించిన రీతిలో జాబిల్లి ఆవలి భాగాన్ని తాకిందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
47 కిలోల బరువున్న ఈ వ్యోమనౌకను గత ఏడాది మే 21న ప్రయోగించారు. ఇందులో సౌదీ అరేబియా అభివృద్ధి చేసిన ఒక ఆప్టికల్ కెమెరా కూడా ఉంది. ఈ బుల్లి వ్యోమనౌక 437 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది.
తాము ప్రయోగించిన వ్యోమనౌక నిర్ణీత సమయానికి తన పని పూర్తిచేసుకుని నిర్దేశిత ప్రాంతంలోనే జాబిల్లి ఆవలి ప్రాంతాన్ని ఢీకొట్టి ధ్వంసమైందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది.